Film Producer-röster

1 röster för Film Producer. Ljud med flera karaktärer för dina berättelser.

Ram Charan

1965 ఏప్రిల్ 26 ,పాకిస్థాన్ భారత్ లో ఉన్న కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాలి, అలాగే కాశ్మీర్ లో ఉన్న ముస్లింలకు స్వేచ్చనివ్వడం అనే నినాదంతో భారత్ కు ముందస్తు సమాచారం ఏమి ఇవ్వకుండా పాకిస్థాన్ యుద్దానికి వచ్చింది.. కానీ 1965 ఏప్రిల్ 23 రాజస్థాన్ లోని జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక ట్రైన్ మునబవ్ మీదిగా పాకిస్థాన్ లోని హైదరాబాద్ కి కొంత మంది వ్యాపారస్తులు మరియు ఫ్యామిలీస్ ని తీసుకొని బయలుదేరింది.. అదే రోజు పాకిస్థాన్ లో ఉన్న భారత్ IB కి చెందిన షిఫాలి పాకిస్థాన్ భారత్ తో యుద్దం చేయడానికి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో , భారత్ ప్రదాని లాల్ బహదూర్ శాస్త్రి భారత్ మరియు పాకిస్థాన్ కి మద్యలో ఉన్న అన్నీ బోర్డర్స్ ని క్లోస్ చెయ్యాలి అదే విధంగా భారత్ సైన్యాన్ని అప్రమత్తం చెయ్యండి అని ఆదేశాలిస్తుండగా, భారత్ నుండి పాకిస్థాన్ కి వెళ్తున్న ట్రైన్ గురించి తెలుస్తుంది.. భారత్ ప్రభుత్వం ఆ ట్రైన్ ని ఆపడానికి చేసిన ప్రయత్నం విఫలమై అప్పటికే ఆ ట్రైన్ భారత్ బోర్డర్స్ దాటుకొని పాకిస్థాన్ లోకి వెళ్ళిపోతుంది.. పాకిస్థాన్ ప్రభుత్వం, పాకిస్థాన్ ఆర్మీని ఐదు బెటాలియన్స్ గా విభజించి, ముక్కీ ఖాన్ బెటాలియాన్ని, భారత్ కు తీర ప్రాంతమైన కాక్రాపార్ దగ్గరకి పంపించింది. ముక్కీ ఖాన్ భారత్ నుండి పాకిస్థాన్ వెళ్తున్న ట్రైన్ ని చూసి ఆ ట్రైన్ ని రిటన్ లో ఆపినట్లైతే, ఆ ట్రైన్ లో ఉన్న ప్రయాణికులని బందీలుగా చేసుకోని యుద్దాన్ని గెలువొచ్చు అని ముక్కీ ఖాన్ ఒక పన్నాగం పన్ని బుట్టోతో మాట్లాడి ట్రైన్ ఆపడానికి అంగీకారాన్ని తీసుకొని ట్రైన్ ఆపడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు.. పాకిస్థాన్ లో ఉన్న భారత్ spy షిఫాలి పాకిస్థాన్ లోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ట్రైన్ లోకో పైలట్ మహదేవ్ ని కలిసి ట్రైన్ ని ఆపడానికి పాకిస్థాన్ ట్రై చేస్తున్న విషయం చెప్తుంది.. విషయం తెలుసుకున్న మహదేవ్, పాకిస్థాన్ చేస్తున్న ప్రయత్నాలన్నీటిని ఛేదించుకుంటూ, ఎలాగైనా ప్రజలని సురక్షితంగా భారత్ కి చేర్చాలని, ట్రైన్ ని భారత్ కి తీసుకువస్తున్నాడు.

Telugu cinemaActorIndian+4

Gör dina berättelser till ljud med Film Producer-röster

Klistra in din berättelse, tilldela röster automatiskt och få ljud med flera karaktärer på några minuter.